సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కేంద్రంలోనీ స్థానిక అంబేద్కర్ కూడలిలోనీ అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం తెలంగాణాలోని వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీ వైద్య విద్యార్థిని ప్రీతి బాయ్ మృతి పట్ల బుధవారం పో ది చెరువు మండల గిరిజన సంఘం నాయకులు కొవ్వొత్తులతో నివాలులు అర్పించారు. ఆమె చిత్రపటాన్ని ప్రదర్శించి అంజలి ఘటించారు. ప్రీతి బాయ్ మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలనీ డిమాండ్ చేశారు. నివాళులు అర్పించిన వారిలో గిరిజన సంఘం నాయకులు గోపాల్ నాయక్, రమేష్ నాయక్, ఆదినారాయణ నాయక్, సర్పంచి గోవిందు, ఉపాధ్యాయుడు నాగరాజునాయక్. టిడిపి నాయకులు నిజాంవలీ, సునీల్, పిట్ల సుధాకర్, చాంద్ బాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ రామాంజనేయులు, మాజీ ఎంపీటీసీ మహబూబ్ బాషా, శంకర్ కుల్లాయప్ప ఉన్నారు...
-----------------------
Admin