సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో సాధ్యమైన ఎక్కువ స్థానాల్లో CPM పార్టీ ఎర్ర జెండా ఎగరవేస్తాం అని CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. CPM పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో చెరుకూరి తోటలో జన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ BJP ప్రభుత్వం ప్రతి ఒక్కరుపై ఆర్థిక భారాలు వేస్తుందని, దేశాన్ని కార్పొరేట్ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. లాభాల్లో వుండే ప్రభుత్వ సంస్థలను అదానీ, అంబానీ లకు తాకట్టు పెడుతున్నారు అని ఆరోపించారు. న్యాయవ్యవస్థను కుడా రాజకీయాల్లోకి లాగుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ లో BJP పార్టీ గెలవడానికి ఎక్కడా అవకాశం ఇవ్వమని తెలిపారు . ఖమ్మం జిల్లాలో ఎర్ర జెండా ఎగురవేయడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, నాయకులు MA జబ్బార్, యర్రా శ్రీనివాస్ రావు,డి తిరుపతిరావు, బషీర్ తదితరులు, కుమార్, సుధాకర్, జగన్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin