సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ని వనందాస్ గడ్డలో జర్పుల మోహన్ చంద్ర ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ద్వారా కుల, మతాలకతీతంగా సహ భక్తి భోజనాలు పెట్టుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని నిర్వాహకులను వారు కొనియాడారు .విజయదశమి అంటేనే చెడుపై మంచి విజయం సాధించడం అని పురాణాలు చెబుతున్నాయని వాళ్ళు పేర్కొన్నారు .ఈ ప్రాంత యువత భక్తిశ్రద్ధలతో అమ్మవారి శరత్నవరాత్రు ఉత్సవాలు నిర్వహించడం ద్వారా యువతలో చెడు మార్గాన్ని విడనాడి మంచి వైపు యువత ప్రయాణించడం శుభ పరిణామం అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోతు చందర్, జర్పుల మోహన్ ,అజ్మీర పూర్ణ , నివాస్, మంజీ, వంశి, శివ, వినోదు, కమల, జానకి ,లక్ష్మి ,వీర ,భారతి ,లక్ష్మీ, తులసి, స్వర్ణ, వంట మాస్టర్ గణేష్ ఉత్సవ కమిటీ యూత్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin