సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వాసుపత్రులలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆదేశించారు. బుధవారం ఓబుల్ దేవర చెరువు, ఆమడగూరు , అంగన్వాడి కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఓబులదేవర చెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు . పీహెచ్సీలో వైద్యులు సిబ్బంది వివరాలను సిహెచ్ఓ సుభాషిణిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవలు మందుల వివరాలు పరిశుభ్రతపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పరిశుభ్రతకు ఆసుపత్రులు చిరునామాగా ప్రభుత్వాసుపత్రులు నిలవాలని తెలిపారు. వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని.. వైద్యులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. అంతేకాకుండా ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ను సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయం వారీగా జన సంఖ్యను పరిగణలోకి తీసుకుని.. వయస్సు వారీగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించాలన్నారు. ఏఎన్ఎం, ఆశ, సిహెచ్ఓ లతో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసుకొని ఆరోగ్య కేంద్రాల పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు చేయాలని చెప్పారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో మందుల కోరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి మహమ్మదాబాద్ క్రాస్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సమయపాలన పాటించాలని అంగన్వాడి సూపర్వైజర్ జయమ్మ కు కలెక్టర్ సూచించారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు, ఫుడ్ బ్యాలెన్స్ పరిశీలించారు, పిల్లల రిజిస్టర్ను నమోదు ప్రక్రియను ఆరా తీశారు. రెండవ ప్రధాన్యతగా బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. మండలంలోఎక్కడా కూడా పోషకాహార లోపం, మాల్ న్యూట్రిషన్ పిల్లలు గానీ, రక్త హీనతతో మహిళలు గానీ కనిపించకూడదన్నారు. సచివాలయ స్థాయి నుండి మండల స్థాయి వరకు కుడా వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఎస్వీ కృష్ణారెడ్డి, ఎమ్మార్వో పి శ్రీధర్, యువోపిఆర్డి రాజశేఖర్, అమ్మడు గురు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin