సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : ఎటపాక మండలంలో పిచుకల పాడు పంచాయతి గుండు వారి గూడెం గ్రామంలో ఉన్న చేపల చెరువులు ప్రతి 15 రోజులు కోసారి పూడిక తీసి మట్టి అమ్ముకోవాలి లేకపోతే చేపలు కు ఆ దళారీ కి నిద్ర పట్టదు ఇంతకీ ఈ దళారి ఎవరెవరికి మట్టి కావాలా అని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్ని తిరిగి వివరాలు సేకరించి అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలాగో అలాగా అక్రమంగా రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టి ని రవాణా చేయాలి లేకపోతే ఆ ఇద్దరికీ నిద్ర పట్టదు ఇదిలాగుంటే అసలు మట్టి అయినా ఇసకైనా ట్రాక్టర్లతోనే తోలాలని అనుమతులతోనే తోలాలని ఒకవేళ టిప్పర్లతో తోలితే 2 లక్షల వరకు జరిమానా ఉందని సదరు అధికారులు జరిమానా అంటారు. చూసి చూడనట్టు వదిలేస్తారు.. ఈ విందంగా ఎటపాక మండలంలో గుండువారి గూడెం గ్రామం నుంచి యదేచ్చగా అక్రమ మట్టి రవాణా గడిచిన రెండు రోజులుగా సదరు దళారి రవాణా చేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు ఇవ్వవలసినవి అందరికీ ముట్టినాయని మేము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని సదరు అక్రమార్కులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమార్కులకి ఇంతటి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది...!ఇకనైనా అధికారులు చర్యలు కు ఉపక్రమించకపోతే ఈ విషయం పై స్థాయి అధికారులకు దృష్టికి తీసుకు వెళతామని ప్రజలు వాపో తున్నారు.
-----------------------
Admin