Wednesday, 29 July 2026 05:19:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనవరి 8 న హైదరాబాద్‌లో విద్యుత్ బీసీ ఉద్యోగుల మహాసభ జయప్రదం చేయండి...

Date : 07 January 2025 03:42 AM Views : 431

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవనంలో జనవరి 8న బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు విద్యుత్ బీసీ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ ఘనంగా జరగనుంది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు, విద్యుత్ బీసీ సంఘం సలహాదారులు ఆర్. కృష్ణయ్య , ఎంపీ ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. ఈ మహాసభలో విద్యుత్ సంస్థల్లో ఉన్న ప్రధాన సమస్యలు, ఉద్యోగుల డిమాండ్లపై చర్చించనున్నారు. విద్యుత్ బీసీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు కోడెపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ సోమవారం పత్రిక ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహాసభలో ప్రస్తావించనున్న ప్రధాన డిమాండ్లు జూన్ 2, 2014 తర్వాత ఇచ్చిన పదోన్నతులను సమీక్షించి నష్టపోయిన బీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి.మెరిట్ ప్రాతిపదికన సీనియారిటీలను ప్రకటించి ఇప్పటికే ఇచ్చిన పదోన్నతులను రెగ్యులర్ చేయాలి. 1999 నుండి 2004 వరకు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ఈ సభ కు బీసీ ఉద్యోగస్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మేంద్రరావు, ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రుడు, నల్గొండ జిల్లా అధ్యక్షులు గంజి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వై.వి.గిరి, బచ్చు రామ్ చందర్, సీతారాములు, చంద్రశేఖర్, రామ్మూర్తి, సత్యనారాయణ, ఈశ్వర్ తదితరులు పాల్గొంటారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :