సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : డిసెంబర్ 30వ తారీఖున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీపడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు,చెక్ బౌన్స్, మనోవర్తి, కుటుంబ తగాదాలు, మోటరు వాహన ప్రమాద కేసులు, ఇ- పెట్టి చాలాన్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మరియు బ్యాంకు, టెలిఫోన్ ప్రిలిటిగేషన్ కేసులను రాజీమార్గం ద్వారా సామరస్యంగ పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ చక్కని అవకాశం అని తెలిపారు. కోర్టులో పరిష్కారం కానీ పెండింగ్ కేసులను ఇరుపక్షాలు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు,సమయం ఆదా మరియు ఇరువురు మనసులను గెలుచుకోవచ్చని న్యాయమూర్తి అన్నారు
-----------------------
Admin