సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలంలో చౌడేపల్లి, రామయ్యపేట , మహమ్మదాబాద్ క్రాస్ నందు పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే కి ప్రజలు పూలమాలలతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గ్రామంలో గల ప్రతి గడపను సందర్శించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలతో ఆరా తీశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొని అక్కడే గల ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరిస్తూ ముందుకు సాగారు. గ్రామ సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి పరిష్కరించ వాటిని అక్కడికక్కడే పరిష్కరించి పరిష్కారం కానటువంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో మిగిలిపోయిన సిమెంట్ రోడ్లను వేయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సిమెంట్ రోడ్లు నిర్మాణానికి ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని ఇంజనీర్ అసిస్టెంట్ ను ఆదేశించారు. స్థలం ఉన్నదని ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరగా హౌసింగ్ ఏఈ తో మాట్లాడి అవసరమైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అనుభవంలో ఉన్న భూమిని పట్టా చేయించాలని ఎమ్మెల్యే అడుగగా సంబంధిత విఆర్ఓ తో మాట్లాడి అసైన్మెంట్ కమిటీలో ఉంచాలని సూచించారు. విద్యుత్ పోల్స్ కావాలని అడగగా ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ అధికారితో మాట్లాడి పోల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చౌడేపల్లి ఇప్పటివరకు ఆధార్ కార్డు లేదని మరియు వారి పిల్లలకు బర్త్ సర్టిఫికెట్ లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వారికి ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ ఇష్యూ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సారంగా చౌడేపల్లి, రామయ్యపేట, మహమ్మదాబాద్ క్రాస్ పరిధిలో గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రభుత్వo ప్రజా ప్రభుత్వామని ప్రజల కోసo ఎంతటి పనినైనా వినపడకుండా చేయగలి దమ్ము ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది అన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్క లబ్బి దారునికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జన్మభూమి కమిటీలను తీసుకు వచ్చి ఎన్ని అరాచకాలు చేశారు.ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనన్నారు. నేడు ఆ పరిస్థితి నుండి పూర్తిగా ప్రజలకు ఉపసమనం కలిగించి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్వీన్ భాను, వైయస్సార్ పార్టీ మైనార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మల షామీర్ భాష, జడ్పిటిసి కుర్లి దామోదర్ రెడ్డి, మండల కన్వీనర్ లు కోళ్ల కృష్ణారెడ్డి, ఇనగులూరు రాజు నాయుడు, ఒడిసి గ్రామ కమిటీ అధ్యక్షులు ఎం. ఆరిఫ్ ఖాన్ ఎమ్మార్వో శ్రీధర్, ఎంపీడీవో పోలప్ప, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలంటరీలు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin