Monday, 14 September 2026 02:12:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

శభాష్ పోలీస్ జంట హత్యల కేసులో నిందితుడు అరెస్ట్... బంగారు ఆభరణాల కోసమే చంపానని వెల్లడి...

Date : 18 June 2023 02:12 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన జంట హత్యల నిందితున్ని పోలీసులు 6 గంటల్లోనే చేదించారు. నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన దివాకర్ గా గుర్తించారు. మృతురాలి పార్వతమ్మ ఇంట్లో కొన్ని రోజులుగా దివాకర్ అద్దెకు ఉండేవాడు. పది రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేశాడు. ఎప్పటినుండో ఒంటరిగా ఉంటున్న పార్వతమ్మ వద్ద ఉన్న బంగారంపై కన్ను వేసిన దివాకర్ శుక్రవారం రెండున్నర గంటల సమయంలో తెల్లవారుజామున బాలిక భానుప్రియ(9) గొంతు కోసి హత్య చేసి, పార్వతమ్మ(58) ను తీవ్రంగా గాయపరిచాడు. శుక్రవారం సాయంత్రం పార్వతమ్మ, భానుప్రియ ఎంతవరకు ఇంటి నుండి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బాలిక చనిపోయి ఉండి పార్వతమ్మ కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఇన్స్పెక్టర్ రామయ్య ఆధ్వర్యంలో పోలీసులు పార్వతమ్మను షాద్నగర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో చికిత్స చేపట్టిన కొద్ది సేపటికి ఆమె మృతి చెందింది. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి పరిశీలించి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో విచారణ చేయించారు. నందిగామ ఇన్స్పెక్టర్ రామయ్య తనదైన శైలిలో విచారణ చేపట్టి నిందితున్ని ఆరు గంటల లోపే పట్టుకున్నారు. కొన్ని గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడంతో నందిగామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ.. నిందితున్ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: