సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ సీతారాం నగర్ 25వ వార్డులో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు అదేర్ల శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మూడో వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ వరలక్ష్మి నాగరాజు, 25 వ వార్డ్ కంటెస్టెడ్ కౌన్సిలర్ సులువ నాగ లక్ష్మి చంద్ర శేఖర్ లు ప్రారంభించి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చండీయాగం, దాదాపు 100 మంది మహిళలతో కుంకుమ పూజ కూడా నిర్వహించడం జరిగింది, అదే విధంగా దాదాపు 3,000 మందికి పైగా మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు నిర్వహించిన కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లాలని, అన్నదానం వడ్డించే మహిళ కమిటీ వారు ఒకే రంగు చీరల తో వచ్చిన వారికి అన్నదాన ప్రసాదం అందించడం అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో నాయకులు పోతనబోయిన రామ్మూర్తి , పాలకూరి లాలు గౌడ్ ,పిల్లి శివశంకర్ , దగ్గుపాటి రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin