సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలంలోని నాచినపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఆదివారం2009- 2010 సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు 15 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులు అందరూ కలిసి ఈ ఆత్మీయ సమ్మేళనంతో కలుసుకోవడం చాలా సంతోషంతో సంబరపడుతూ సందడి చేశారు ముందుగా వారికి విద్యానందించిన గురువు లందరినీ స్టేజి పైకి ఆహ్వానించి ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికను అందజేశారు వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకున్నారు కొందరు విద్యార్థులు మాట్లాడుతూ మా గురువులను నేర్పిన సంస్కారాన్ని మేము ఇప్పటికీ పాటిస్తున్నాము చెప్పారు ఈ పాఠశాలలో చదువుకునే రోజుల్లో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చాలా సంబరపడ్డారు వారితోని చదువుకుని స్వర్గస్తులైన బాల్యమిత్రులు గుర్తుచేసుకొని ఒక నిమిషం మౌనం పాటించడం నివాళులర్పించడం జరిగింది అనంతరం మిత్రులందరికీ కలిసి లంచ్ మధ్యాహ్నం భోజనం చేసుకొని ఒకరినొకరు పలకరించుకుంటూ తిన్నారు ఉపాధ్యాయులు. రాజశేఖర్ కుమారస్వామి దూలం రాజేందర్ రవీందర్ శ్రీనివాస్ చారి సురేందర్ రాములు ఈ కార్యక్రమాన్ని ముందుండి గణేష్ నర్సింగం వినోద్ నడిపించిన వారు తోటి మిత్రులందరు పాల్గొన్నారు.
-----------------------
Reporter