సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : ప్రజలందరికీ ముందస్తు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన SI శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.... దసరా సెలవుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు యువకులను ఉద్దేశిస్తూ దసరా సెలవులను ఎంజాయ్ చేసే ఉత్సాహంలో సత్యవేడు నియోజకవర్గంలోని పలు పర్యాటక ప్రాంతాలలో వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,మండల కేంద్రాలలో శబ్ద కాలుష్యానికి పాల్పడడం, పండగ ముసుగులో జూదాలకు పాల్పడడం చేయవద్దని హెచ్చరిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, సెలవుల సమయంలో పండగ సందర్భంగా వారి వారి కుటుంబాలలో శోకాన్ని మిగల్చవద్దని కోరారు... ఏది ఏమైనా దసరా ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల దేవీ నవరాత్రులతో పాటు పదవ రోజు విజయదశమి కలసి దసరా... ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పండుగను కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో చేసుకొని సుఖసంతోషాలతో ఉండాలని పోలీసు శాఖ ఉద్దేశమని గమనించమని కోరుతున్నామని తెలిపారు...
-----------------------
Admin