సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎంతో గొప్ప ఉన్నత వ్యక్తి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొనియాడారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభలో అధికారికంగా ప్రకటించారు. స్పీకర్కు ఎమ్మెల్యేల అభినందనల అనంతరం స్పీకర్కు ధన్యవాదాల తీర్మానంపై శాసన సభ్యులు మాట్లాడారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ సభలో మాట్లాడుతూ.. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని.. భవిష్యత్లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గడ్డం ప్రసాద్ తన సొంత జిల్లా నేత అని తెలిపారు. వికారాబాద్కు ఎంతో విశిష్టత ఉందన్నారు. వికారాబాద్ గుట్ట వైద్యానికి పెట్టింది పేరన్నారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు గడ్డం ప్రసాద్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. గొప్ప వ్యక్తి సభకు స్పీకర్ అయ్యారని కొనియాడారు. కింది స్థాయి నుంచి స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఎదిగారన్నారు. వికారాబాద్ అభివృద్ధిలో గడ్డం ప్రసాద్ ది చెరగని ముద్ర అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పీకర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని అభినందనలు తెలిపారు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినమ్ర పూర్వకంగా కూడా నమస్కరించారు.
-----------------------
Admin