సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువు మండలం చేరుకొని, ఉగాది సందర్భంగా బస చేస్తున్న ప్రాంతంలో నారా లోకేష్ ని మాజీ మంత్రి , పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి పల్లె రఘునాథ రెడ్డి , అయన తనయుడు బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి , కోడలు పల్లె సింధూర మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు.ఆయనను శాలువాతో సత్కరించి, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి చిత్రపటం అందించారు.ఈ సందర్భంగా వీరి భేటీలో పలు వ్యక్తిగత అంశాలతో పాటుగా రాజకీయ అంశాలు చర్చించారు.
-----------------------
Admin