సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు మండలం చెరువు తండ గ్రామంలో గడపగడప భరోసా యాత్ర, ప్రచారంలో భాగంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు అభ్యర్థి పిల్లుట్ల రఘుకు గ్రామవాసులు ఘన స్వాగతం పలికారు.పలు రకాల సేవ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకుంటున్న పిల్లుట్ల రఘు సింహం గుర్తుకే తమ ఓటు అంటున్న గ్రామస్తులు.సొంత ఖర్చులతో ప్రతి తండాలో మెరియాడి గుడిని నిర్మిస్తూ, నియోజవర్గంలో ప్రతి గ్రామంలో, పట్టణంలో అనేకమందికి విద్య, వైద్య,ఆర్థిక సేవలను అందిస్తూ, పాఠశాలలను, దేవాలయాలను నిర్మిస్తున్న ఘనత తనదే అన్నారు. ప్రజా ఓటుతో గెలిచిన అధికార నాయకుడు ఎవరు కూడా కనీసం మౌలిక వసతులు కూడా తీర్చ లేదు అన్నారు ప్రజలు సింహం గుర్తుకు ఓటేసి తనను ఆదరించాలని అన్నారు.ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలుస్తానని తన గెలుపును ఎవరు ఆపలేరు అని ధీమా వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని అన్నారు.ఈ ప్రచార కార్య క్రమంలో గ్రామస్తులు,రఘున్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, యవతి యువకులు తదితరులు ఉన్నారు.
-----------------------
Admin