సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్ నగర్ మండలంలోని దుస్కల్ గ్రామంలో ఉన్నత పాఠశాలలో 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారులు దేశభక్తి పాటలతో, నృత్యాలతో అలరించారు. దూస్ కల్ ఎంపిటిసి శ్రీ యాదయ్య దాదాపు15 వేల విలువైన టై, బెల్టులు ప్రాథమిక, ఉన్నత పాఠశాల చిన్నారులకు అందించారు. అనంతరం విద్యార్థులు నృత్య ప్రదర్శన చేశారు. ఆ తరువాత నృత్య ప్రదర్శనలో గెలుపొందిన వారికి అభినందిస్తూ మేడిపల్లి నర్సిములు 2 వేల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మురళీధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఆరాధన, డిప్యూటీ సర్పంచ్ శివ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్, కరుణ శ్రీ, ఉపాధ్యాయులు సురేందర్ రెడ్డి, వినయశీల, రామేశ్వరమ్మ, నీల్యా, రేవతి, జ్యోతి, సర్ఫరాజ్ అన్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
-----------------------
Admin