సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్:కలకత్తాలోని ఆర్ జి కె ఏ ఆర్ మెడికల్ కాలేజీలో ఊపిరితిత్తుల విభాగంలో పీజీ చదువుతున్న డాక్టర్ మోమిత ను అతి దారుణంగా హింసించి అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను వెంటనే శిక్షించాలని ఈఎస్ఐ ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర రావు డిమాండ్ చేశారు. ఈరోజు హుజూర్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజల ఆరోగ్యం వారి బాగుకై పాటుపడుతున్న వైద్యులు మరియు వైద్య సిబ్బందిపై ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న కిరాతకుల పై కఠిన చట్టాలను అమలుపరచాలని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇట్టి నిరసనలో డాక్టర్ శివ శంకర్ ఫార్మసిస్టులు కరుణ అసిఫ్ స్రవంతి ల్యాబ్ టెక్నీషియన్ శ్యాం కుమార్ స్టాఫ్ నర్స్ శాంతకుమారి సీతాదేవి సీనియర్ అసిస్టెంట్ మౌనిక ,జ్యోతి జూనియర్ అసిస్టెంట్ భూపాల్, ఏఎన్ఎం సునీత, ఎఫ్ ఎన్ ఓ వినీత సైదమ్మ రికార్డ్ అసిస్టెంట్ స్వాతి సబార్డినేటర్ నవీన్ ,ప్రశాంత్ జ్యోతి ,రాజేశ్వరి. తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin