సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలం మరియు గ్రామానికి చెందిన చిన్నపంగు బాలరాజు తండ్రి సైదయ్య, వయస్సు 52 సంవత్సరాలు అను వ్యక్తి మఠం పల్లి మిషన్ భగీరధ పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తించుటకు తేదీ 21.03.2023 నాడు రాత్రి 08.30 గంటల సమయములో తన బండి ఏ పి 27 8664 పై వస్తుండగా చౌటపల్లి గ్రామం వద్దకు వచ్చేసరికి తనకు ఎదురుగా వస్తున్న లారీ నెం ఏపి-24TB-1023 గల డ్రైవర్ తన లారీని అతివేగముగా అజాగ్రత్తగా నడుపుకుంటు వచ్చి చిన్నపంగు బాలరజూ బండిని ఢీ కొట్టగా అతను అక్కడి కక్కడే మృతి చెందినాడు, ఇట్టి మృతి పై మృతుని కుమారుడు యెల్లేష్, వయస్సు 25 సంవత్సరాలు ఫిర్యాదు ఇవ్వగా అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మెళ్ళ చెరువు ఎస్ ఐ తెలిపారు.
-----------------------
Admin