సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : ఆర్మూర్ బీజేపీ పార్టీ శ్రేణుల అంబరాన్నoటిన సంబరాలు... బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకరిపై ఒకరు పసుపు చల్లుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా నెరవేరిన పసుపు రైతుల కలను పసుపు బోర్డును ప్రకటించిన నరేంద్ర మోడీ సుసాధ్యం బిజెపి రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పైడి రాకేష్ రెడ్డి, కంచెటి గంగాధర్ లు చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మోడీ చిత్రపటాన్ని పసుపుతో అభిషేకం చేశారు. జై మోడీ జై జై మోడీ అంటూ నినాదాలను చేశారు. ప్రపంచంలోనే ఆర్మూర్ పసుపు రైతులు పండించే పసుపు సాగుకు ఏ పార్టీ పట్టించుకోకుండా దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ప్రకటించిన రైతులకు కన్నీళ్లు తుడిచారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు రైతులకు గిట్టుబాటు ధర, ఎగుమతులతో పాటు ఎన్నో రకాలగా సౌకర్యం వంతంగా ఉంటుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఎంపీ అరవింద్ కృషి చేశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు అంశంపై గతంలో బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు శ్రేణులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇస్సపల్లి గ్రామంలో బిజెపి ఎంపీపై రాళ్లతో, కత్తులతో దాడులు చేశారని వారు తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానాలను మరిచిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఓటు ఆడదానికి ఎలా వెళ్తారని పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, నూతన శ్రీనివాస్ రెడ్డి, జస్సు అనిల్, ధ్యాగ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజు, కలిగోట్ బిజెపి కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin