సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజాసంఘాలు ప్రతిపక్షాలు గత నెల రోజుల వారీగా వివిధ దశల వారి ఆందోళన కార్యక్రమాలు భాగంగా ఈ నెల రెండోవ తేదీ నుండి రిలే నిరాహార దీక్షలకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగా రిలే నిరాహారదీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను ఉద్దేశించి సిపిఐ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.శ్రీను మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో షాద్ నగర్ బహిరంగ సభలో ప్రజలకు లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని మాట ఇచ్చినా సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కూడా 2019 ఎలక్షన్ అప్పుడు లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు నిర్మిస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేశారు. ఈసారి అయిన చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలి త్వరలోనే లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి లేని పక్షాన షాద్ నగర్ లో ఉన్న రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నునిర్మించే వరకు వామపక్ష ప్రజా విద్యార్థి సంఘాల ఉద్యమాలు ఆగమని అన్నారు. ఈ జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు సిపిఐ పార్టీ నందిగామ మండల కార్యదర్శి గడ్డం జంగయ్య, కేశంపేట్ మండల కార్యదర్శి గోవింద్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు ఎం పవన్ చౌహన్, చంద్రబాబు, లింగం నాయక్, విటల్ యాదవ్, గడ్డం లక్ష్మయ్య, కిషన్ నాయక్, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం షాద్ నగర్ అధ్యక్షుడు విజయ చారి, కార్యదర్శి ఆకాష్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin