సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని అన్ని రకాల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయని యోగ మాస్టర్ తమ్మర నర్సింహారెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని వాసవి భవన్ నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ది.13/7 /2023 గురువారం నుండి వాసవి భవన్ నందు యోగ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు రెండు బ్యాచ్ లుగా క్లాసులు ఉంటాయని ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మరియు 6 గంటల నుండి 7 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని తెలిపారు. యోగ క్లాసులకు వచ్చే వాళ్లు యోగ మ్యాట్లు వాటర్ బాటిల్ నోట్ బుక్ పెన్ను తెచ్చుకోగలరని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో యోగ మాస్టర్ శ్రీ తమర నరసింహారెడ్డి తో పాటు వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు , వాసవి భవన్ వీర్లపాటి రమేష్ , ఎస్ బి బుక్ స్టాల్ జానకి రాములు , సన్నీ గ్రాఫిక్స్ సందీప్ , వినాయక ప్రింటర్స్ ఉపేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin