సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం కేంద్రంలో పల్లవి మండల సమాఖ్య కార్యాలయం సమావేశ భవనం నందు కదిరి మరియు ఓబుల దేవర చెరువు ఏ.సి క్లస్టర్ల మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్లు,యల్.సిలు మరియు ఏ.పి.యం రమణప్పమండల సమాఖ్య ఆర్థిక నిర్వహణపై జరిగిన ఒక్కరోజు శిక్షణా కార్యక్రమానికి హాజరయి శిక్షణా ఉద్దేశ్యం తెలియచేస్తూ ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ప్రగతిలో జిల్లాను అన్ని కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో ఉండేందుకు కృషి చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.యన్.నరసయ్య తెలియచేయడమైనది. డి.పి.యం.యు సిబ్బంది (రిసోర్స్ పర్సన్) శిక్షణ కార్యక్రమం నందు మాట్లాడుతూ. 1)మండలసమాఖ్య ప్రతినిధుల విధులు - బాద్యతలు,2)అకౌంటెంట్ల విధులు - బాద్యతలు, 3)యల్.సి ల విధులు - బాద్యతలు, 4)ఏ.పి.యంల విధులు – బాద్యతలు, 5)మండల సమాఖ్య ఆస్థుల తనిఖీ, 6)మండల సమాఖ్య ఆర్థిక నిర్వహణ, 7)శాసనాత్మక బాద్యతలు, 8)జీవనోపాదుల కల్పన, 9)ఇన్సూరెన్స్ సర్వీసుల గురించి, 10)కమ్యూనిటీ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ 11) ప్రభుత్వ పథకాలపై ఇతర డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకోవాలని తెలియ చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి ఏ పి ఎం రమణప్ప మండల సమాఖ్య ప్రతినిధులు, అకౌంటెంట్లు,యల్.సిలు మరియు ఏ.పి.యంలు, డి.పి.యం హాజరు కావడం జరిగింది.
-----------------------
Admin