సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ పట్టణ పరిధి సూపర్ బజార్ సెంటర్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవి రంగా కిరణ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి చేసిన మహాత్ముని సేవలు కొనియాడారు స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులను ఏకంచేసి, దేశానికి స్వాతంత్రం సాధించడంలో ముఖ్యమైన భూమికను పోషించారని అన్నారు. అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యన్నీ సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాసరావు, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి జిల్లాలకు శ్రీనివాసరావు, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాజేష్ నాయక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కటీకల రంజిత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రామ్, భీముడు, విజయ్, బోడియా, కుమార్, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin