సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దృష్టిలోపం ఉన్నవారికి కంటి చూపు ఏర్పడేలా చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయం అని కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పాత పాల్వంచలోని హైస్కూల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా తాను కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ కంటి వైద్యం చేయించలేని లక్షలాదిమంది పేద ప్రజలకు చూపు ప్రసాదించాలని గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, గతంలో ఒకసారి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగిందని మరల ఇప్పుడు రెండోసారి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజలు 100 రోజులపాటు జరిగే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వనమా అన్నారు. ఈ కార్యక్రమంలో కంటి వెలుగు రాష్ట్ర నోడల్ అధికారి రవికుమార్, జిల్లా వైద్యాధికారి. జే.వి.ఎల్. శిరీష, డాక్టర్ నామా బుచ్చయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహసిల్దార్ రంగా ప్రసాద్, సిడిపిఓ కనకదుర్గ, పట్టణ ఎస్ఐ నరేష్, మున్సిపల్ ఏఈ రాజేష్, బి. ఆర్. ఎస్ పట్టణ అధ్యక్షులు మంతపురి రాజు గౌడ్, పెద్దమ్మ గుడి మాజీ చైర్మన్ మహిపతి రామలింగం, సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్ కనగాల నారాయణరావు, బి. ఆర్. ఎస్ నాయకులు కొత్వాల సత్యనారాయణ, కాల్వ ప్రకాశరావు, కనగాల బాలకృష్ణ, దాసరి నాగేశ్వరరావు, బొందిల రాంబాబు, ఏనుగుల శ్రీను, గడ్డం రమణయ్య, నవభారత్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin