సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఈనెల 20 న తుంగతుర్తి లో జరిగే టి యు డబ్ల్యూ, ఐ జే యు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ , ఐ జే యు జిల్లా ఉపాధ్యక్షులు పండ్లకొండ గంగాధర్, కార్యదర్శి బైరబోయిన వెంకటేశ్వర్లు కోరారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా సర్వసభ్య సమావేశం తుంగతుర్తి మండల కేంద్రంలోని సిరి ఫంక్షన్ హాల్ లో జరుగుతుందని వారు చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామెల్, ఐజేయు జాతీయ నాయకులు కొణిజేటి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలి తోపాటు పలువురు నాయకులు హాజరుకానున్నారని వారు తెలిపారు సమావేశానికి జిల్లాలోని అన్ని మండలాల జర్నలిస్టులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు ఈ సమావేశంలో టియుడబ్ల్యూజేఐజేయు తిరుమలగిరి మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల వీరస్వామి గౌడ్, కొమ్ము ప్రవీణ్ జర్నలిస్టులు చోల్లేటి రాములు జానీ ,లింగయ్య మల్లేపాక కృష్ణ రాములు నాయక్ మల్లేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin