సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు భూక్య రాజేష్ నాయక్ నేతృత్వంలో మండలంలో అర్హులైన నిరుపేదలకు పెన్షన్లు , కొత్త రేషన్ కార్డులు , డబల్ బెడ్ రూమ్ మంజూరు మరియు స్థానిక సమస్యలపై సుజాతనగర్ మండల ఎండిఓ కార్యాలయంలో సూపర్డెంట్ యాకూబ్ కు మరియు తహసీల్దార్ సునీల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా రంగా కిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హాని మీని ఇంతవరకు నెరవేర్చలేదని 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ బుట్ట దాకలు అయిందని అన్నారు. అదేవిధంగా ఈరోజు సుజాతనగర్ మండలంలోని సర్వారం గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ పథకం లో భాగంగా పనిచేస్తున్న గ్రామస్తులను కలుసుకొని కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా కె.వి.రంగా కిరణ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఇ స్రమ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ పథకం , ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ కన్వీనర్ నరేంద్రబాబు , చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి చింతలచెరువు శ్రీనివాస్ రావు , జిల్లా కోశాధికారి జల్లారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin