సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తిరుమలగిరి మండలం మర్రికుంట తండా గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి గుంతలతో అస్తవ్యస్తంగా ఉండడం వల్ల బాటసారిలకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు అకస్మికంగా ప్రమాదాలు జరుగుతే ఆసుపత్రికి వెళ్లేవారు గర్భిణి స్త్రీలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనేక సార్లు విన్నవించిన పట్టించుకోని పరిస్థితి. ఈ విషయం మండల కాంగ్రెస్ పార్టీ దృష్టికి వచ్చినందున వెంటనే మండల కాంగ్రెస్ బృందం స్పందించి బురదమయంగా మారిన రహదారిలో స్థానిక మహిళలు యువకులతో కలిసి నాట్లు వేసి నిరసన తెలిపి మరి కుంట తండా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్సొజు నరేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య ఎన్ ఎస్ యూ ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ గుండెపుడి ఎంపిటిసి ధరావత్ జుమ్మిలాల్ ఎస్టీ సెల్ చైర్మన్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధూపాటి మల్లయ్య రాజు నాయక్ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు బానోతు భాస్కర్ శీను రాజేందర్ యువజన కాంగ్రెస్ నాయకులు బోన్ల వంశీ రోషగా అధ్యక్షులు సైదా రాకేష్ మహేష్ వంశీ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin