సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (మున్సిపాలిటీ): మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పదో వార్డులో జిల్లా వైద్యశాఖ ఆదేశాల ప్రకారం రామవరం యు పి హెచ్ సి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు .సుమారు వైద్య శిబిరంలో వందమంది వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ యు పి హెచ్ సి డాక్టర్ రాము మాట్లాడుతూ వర్షాకాలం డెంగ్యూ ,మలేరియా, టైఫాయిడ్ మొదలైన విష జ్వరాల బారిన ప్రజలు పడే ప్రమాదం ఉందని భావించి ముందస్తుగానే ప్రజల రక్తనమోనాలను సేకరించి వ్యాధిని గుర్తించి మందులు ఇవ్వడం జరుగుతుందని వారన్నారు. ప్రజలందరూ విష జ్వరాన బారిన పడకుండా తమ పరిసర ప్రాంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు .వార్డులో ముందస్తుగానే దోమల పాగింగ్ చేయించడం జరిగిందని ఇంకా కాలువల్లో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు దోమల మందు పిచికారి చేయించాలని మున్సిపల్ అధికారులకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఓ శ్రీనివాస్ ఏఎన్ఎం రావుల కవిత ,శ్రీలక్ష్మి, మంజుల, ఆశా వర్కర్ భవాని, అంగన్వాడీ టీచర్స్ ఎన్ సరోజ, షానాజ్ బేగం ఆర్పి కవిత ,కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin