సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి , కోశాధికారి కోటమ్మ ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పట్టణ అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లలో కుందూరు రఘువీరా రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కష్టపడి పని పార్టీలో మా వంతు కృషి చేస్తామని వాగ్దానం చేసి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసి పార్టీని గెలిపించుకుంటామని ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీకి కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమపంగు విజయ, బత్తిని సుగుణ, ఊటుకూరు రాణి, చిట్టిబోలు పద్మ, నాన్న వరకు సుహాసిని, ములకలపల్లి పద్మ ,కనగండ్ల జానకమ్మ, పిట్టల జ్యోతి, నందిపాటి ఉమా ,పిట్టల నాగమణి, గణపారపు కళ్యాణి, పేరం భీములు, తాటి ప్రమీల, తమ్మిశెట్టి వెంకమ్మ ,పల్లపు రమణ ,సింగం రేణుక, చల్ల గీతిక తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin