సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : జిల్లాలోని బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యల పరిష్కరించాలని, కళాశాల వసతి గృహములకు సొంత భవనాలు నియమించాలని, పెండింగ్లో ఉన్న డైట్ బిల్స్ పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ మెస్ చార్జీలు పెంచాలని, గెజిటెడ్ హోదా కలిగిన వారిని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలోతెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాల మాయా దేవి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ కే ఫహీమ్ దాదా , బి ఎస్ ఏ జిల్లా కన్వీనర్ నాగరాజు, పి డి ఎస్ యు రాష్ట్ర నాయకురాలు మంజుల పాల్గొన్నారు...
-----------------------
Admin