సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం బయ్యారం చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీ శారదా రైస్ ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీ టి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రైస్ హబ్ గా మారిందని అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతు ఆత్మహత్యలు తగ్గిన రాష్ట్రల్లో దేశంలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని అన్నారు. రైతు తలెత్తుకొని గౌరవంగా తిరిగేలా చేస్తానన్న సీఎం శ్రీ కేసీఆర్ మాటలు కార్యరూపం దాలుస్తున్నయని అన్నారు. రైతుల కోసం ప్రవేశ పెట్టిన పథకాలు రైతుబందు,రైతుభిమా రైతుల కండ్లల్లో సంతోషం నింపిందని అన్నారు. గ్రామగ్రామాన రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చివరి గింజ వరకు కొనుగులు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణనే అన్నారు. ఈ సందర్భంగా వారివెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి , FDC చైర్మన్ ప్రతాపరెడ్డి మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ RBS రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు , ఆత్మకమిటి చైర్మన్ ఊడేం కృష్ణా రెడ్డి, మరియు స్థానిక సర్పంచ్ మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ జఖి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నిర్వాహకులు గంగిశెట్టి సుధాకర్ , రేనికుంట శ్రీనివాస్ , సూర్య ప్రకాష్ , స్థానిక సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, తెరాస నాయకులు కార్యకర్తలు ఉన్నారు..
-----------------------
Admin