సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మెలో భాగంగా మధ్యాహ్నం భోజనం కార్మికులు వంట వార్పు చేసుకుని నిరసన తెలియజేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి వారి డిమాండ్లను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు సయ్యద్ రన్ మియా మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం వంటకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని కోడిగుడ్లు కందిపప్పు ప్రభుత్వం సరఫరా చేయాలని వారికి పెంచిన రోజులు వారి కూలి జూన్ నెల నుండి ఇవ్వాలని మరియు కార్మికులందరికీ ఐడెంటి కార్డులు ఇచ్చి వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లచ్చిరాం, శాంతకుమారి, గోవిందమ్మ, సాలమ్మ, సత్యవతి ,కొమ్ము పద్మ, పిల్లి లక్ష్మీ, భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin