సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : కొండ మల్లేపల్లి మండలంలో పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో 'కల్యాణ' కాంతులు ... కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు ఆసరా... రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ ... గర్భిణీ స్త్రీలకు న్యూట్రీషన్ కిట్ ... దేవరకొండ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్షీ, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలుచేస్తోందని దేవరకొండ శాసన సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ మండలానికి చెందిన 78మందికి రూ.78లక్షలు,కొండమల్లెపల్లి మండలానికి చెందిన 68మందికి రూ.68లక్షల చెక్కులను,చీరలను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... గర్భిణీ స్త్రీలకు న్యూట్రీషన్ కిట్ అందించడం జరుగుతుంది అని ఆయన తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. ..
-----------------------
Admin