సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల కొండకమర్ల గ్రామo లొ ఆటో స్టాండ్ వద్ద యువకుడు అబ్దుల్ ఆధ్వర్యంలో చలివేంద్రం శిబిరం ఏర్పాటు చేయగా,ఎస్ఐ కే. గోపీ ప్రారంభించారు, ఎస్సై గోపి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురికి ఆదర్శంగా ఉండాలని ఎస్ఐ కే.గోపీ పిలుపునిచ్చారు. కొండకమర్ల గ్రామ యువకుడు అబ్దుల్ వేసవి కాలంలో దాహర్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేసిన యువకుడు అబ్బులు సేవలు అభినందనీయమని ఈసందర్బంగా ఎస్ఐ కే. గోపీ కొనియాడారు. ప్రస్తుత ఉన్న సమాజంలో యువత పెడుత్రోవపడుచున్నారని,ఇలాంటి సంఘటనలతో జీవితాలు చిన్నభిన్నామౌతాయని, విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాల్లో పాల్గోని పలువురికి ఆదర్శంగా నిలవాలని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎస్సై గోపి .ఈకార్యక్రమంలో కిరణ్, సింగనమల్ల బాబు, బాబ్జాన్ రమేష్ నాయక్, మధుసూదన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin