సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం పాపయ్య పేట అమ్రు తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ బాలాజీ జర్పుల బాలు గార్లు మండల ఉపాధ్యక్షులు కందాల చంద్రమౌళి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు దామరప్పుల శేఖర్ అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్బంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమలో మండల ప్రధాన కార్యదర్శి కిసరి సాంబరాజు బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఎర్ర రాజు మరాఠీ ఉప్పలయ్య మెర్గు యాకయ్య మేర్గు నవీన్ తోటగిరి నారాయణ బానోత్ నరేష్ పడిదం హరి కృష్ణ లావుడ్యా సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter