Tuesday, 15 September 2026 09:58:02 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అర్హులందరికీ సంక్షేమ పథకాలు... - ఎంపిటిసి మీసాల ఉపేందర్

Date : 29 December 2023 09:20 AM Views : 212

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని 6హామీల అమలుకు ముందడుగు వేసి ఆర్టీసిబస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం తోపాటు ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు అధికారికంగా అమలు చేస్తూ, అభయహస్తం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి నేటి నుండి జనవరి 6వ తేదీ వరకు గ్రామాలలోకి ప్రజల వద్దకే అధికారులు వచ్చి దరఖా స్తులు తీసుకుంటారని, దరఖాస్తు ఫారాలు కూడా ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డిలు తెలిపారు. పాలకవీడు మండల కేంద్రము లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన దరఖాస్తు ఫారాలను పంపిణీ చేసి మాట్లాడారు.జనవరి 2 వ తేదీన గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను,ముందుగానే ప్రజలకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. దరఖాస్తు ఫారాలను నింపడంలో లబ్ధిదారులకు సహకారం అందించాలని అధికారులను కోరారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.గ్రామంలో స్త్రీ పురుషులకు విడివిడిగా ఆరు కౌంటర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి మీసాల వెంకటేష్,పంచాయతీ కార్యదర్శి జ్యోతి,అంగన్వాడీ టీచర్ కందాల విజయలక్ష్మి, గ్రామస్థులురాజు,రాములు,లింగయ్య,శంకరయ్య,వెంకట్ రెడ్డి,సైదులు,శ్రీనివాస్, జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: