సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: ట్రేడ్ లైసెన్స్ పేరుతో మున్సిపల్ సిబ్బంది అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు రద్దు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యాపారస్తులను భయబ్రాంతులకు గురిచేస్తూ ట్రేడ్ లైసెన్స్ పేరుతో నోటీసులు ఇస్తున్నారని,గత సంవత్సరం షాపులు ఏర్పాటు చేసుకున్న వారు కూడా 2019 నుండి డబ్బులు కట్టాలని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.ప్రతీ షాప్ కు హరితనిధి క్రింద సంవత్సరానికి 100 కట్టాలనడం ఏంటని ప్రశ్నించారు.గతంలో కట్టిన వారికి కూడా కట్టలేదని నోటీసులు జారీ చేశారని మా దృష్టికి వచ్చిందని తెలిపారు.బస్తీలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వారికి కూడా నోటీసులు ఇస్తున్నారని,ఒకవైపు వందల కోట్ల నిధులు తీసుకోచ్చమని ప్రకటనలు ఇస్తూ ఇంకోవైపు వేలకు వేలు వసూలు చేయడం సరైంది కాదని ఈ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.లేని యెడల భవిష్యత్తులో వ్యాపారులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయి,నాగుల రవికుమార్,ఆట శ్రీకాంత్,రాంబాబు,సరోజ,లక్ష్మీ*తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin