సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల పరిధి సమీపంలో ఎం.కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయ ఆవరణలో శ్రీ విద్యాగణపతి సన్నిధిలో జూన్ 14వ తేది జేష్ట్య మాస ఏకాదశి అశ్వని నక్షత్రం పురస్కరించుకొని చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు తెలిపారు. సోమవారం రెవిన్యూ కార్యాలయం వద్ద అక్షరాభ్యాసం కరపత్రాలు తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్, ఎంపిడిఓ పోలప్ప చేతుల మీదుగా విడుదల చేయగా,మండల విద్యాధికారి ఎస్ఎండి ఖాదర్ వలి బాషా, ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ, ఏపిడి శ్రీనివాసులు, హోసింగ్ ఏఈ హరినాథ్ రెడ్డి, రిసర్వే డిప్యూటీ తహసీల్దార్ జాకీర్, ఆర్ఐ నాగేంద్ర, ఈఓఆర్ డి రాజశేఖర్, వెలుగు సీసీ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ.... మండలంలో ఎక్కడలేనివిధంగా అయ్యప్పస్వామి దేవస్థానం ఆవరణలో శ్రీ విద్యాగణపతి సన్నిధిలో.... బాసర జ్ఞాన సరస్వతిదేవి ఆలయంలో నిర్వహించే తరహాలో 5 నుండి 6 ఏళ్ళ చిన్నారులకు(పాఠశాలలో చేర్పించే ముందు)తొలి అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు శ్రీకారం చుట్టి ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు. మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈసందర్బంగా ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ....కదిరికి చెందిన దాత రిటైర్డ్ హెచ్ఎం కీర్తిశేషులు చంద్రమౌళి కుమారుడు కోడూరు శ్రీకాంత్ సహాయ సహకారాలతో అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు ఉచితంగా పలక,బలపం అందించినున్నట్లు తెలిపారు. అలాగే అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొనే 5 నుండి 6 ఏళ్ల చిన్నారుల పేర్లు జూన్ 5వ తేది లోపు ఈ నంబర్లను 9908342433, 8106346433 సంప్రదించి ముందుగా నమోదు చేసుకోవాలని పేర్కొంటూ....ఆలయంలో పురోహితులతో పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ అన్న ప్రసాదాలు అందిస్తారని తెలిపారు. ఈకార్యక్రమంలో సర్వేయర్ వినోద్ కుమార్ రెడ్డి,వీఆర్వోలు వెంకటరమణ, శివప్ప,రమణస్వామి,లోకేశ్వరి, వీఆర్ఏలు రంగప్ప,రాముడు,సుమలత, సోము,సిఓ విశ్వనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin