సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్స్ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతూ అవార్డును అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అవార్డు రావడం పట్ల షర్మిల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి కాలంలో తెలంగాణ ప్రాంతామంతా కూడా బంగారు తెలంగాణలా ఉండేదని ఆమె అన్నారు. ఒకనాడు ఇండియాను తెల్లదొరలు పాలిస్తే. ఈనాడు తెలంగాణని ఓ నల్లదొర పాలిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నల్లదొర చెర నుంచి విడిపించుకోవాలని ఆమె కోరారు. కేసీఆర్ పాలన పోయిన రోజునే తెలంగాణకు నిజమైన స్వతంత్రం అంటూ ఆమె పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే గ్రూప్ 1 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏ తెలంగాణ వారు ఎవరూ కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకి అర్హులు కారా అంటూ ఆమె నిలదీశారు. కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. బీసీ బంధు అంటూ. దళిత బంధు అంటూ కోతలు కోశాడు. అవన్నీ ఎక్కడ పెట్టాడు.ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా అంటూ కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.
-----------------------
Admin