సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రం అంబేద్కర్ సర్కిల్లో భారతీయ జనతా పార్టీ ఓబుల దేవర చెరువు మండల అధ్యక్షులు వెంకటరమణప్ప ఆధ్వర్యంలో ఈరోజు గుజరాత్ రాష్ట్రంలో వరసగా ఏడవ సారి అసెంబ్లీ ఎన్నికలలో విజయదుందుభి మోగించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పటేల్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా కేంద్రం ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో సఫలం కావడంతో గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకు మరొక నిదర్శనం అన్నారు.గుజరాత్ ప్రజలు బిజెపిని ఊహించని రీతిలో మెజార్టీతో విజయకేతనం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ బానసంచాలు పేల్చి,మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది.రాబోవు కాలంలో జరగబోవు రాష్ట్రాల ఎన్నికలలో కూడా ఇలాంటి ఫలితమే పునరావృతం కావాలని కేంద్రంలో 2024 లో కూడా బిజెపి ప్రభుత్వం రావాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిలాషించారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి,ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాగప్ప,బిజేవైయం మండల అధ్యక్షులు మురళి,సురేష్,యస్.సి మోర్చా అధ్యక్షులు కిష్టప్ప,మండల నాయకులు రమణయ్య,రాము,జనార్దన్ రెడ్డి పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin