సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా పెద్దవంగర మండలం కన్వాయిగూడెం గ్రామానికి చెందిన కర్ర అశోక్ రెడ్డి (బాధితుడు) ఓ బిల్లు సంతకం కోసం డీఈ ని కోరగా డీఈ 50వేల రూపాయలు డిమాండ్ చేయడంతో అశోక్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు హనుమకొండ లోని భవానీ నగర్ లో పాలకుర్తి డివిజన్-5 మండలాల ఇరిగేషన్ డీఈ శ్రీకాంత్ 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ, డీఎస్పీ సాంబయ్య ఈ విధంగా తెలిపారు. 2018లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల బిల్లుల విషయంలో డీఈ శ్రీకాంత్ను రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని సాంబయ్య తెలిపారు. ప్రస్తుతం భవాని నగర్ లోని శ్రీకాంత్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని వెల్లడించారు. సోదాలు నిర్వహించిన అనంతరం శ్రీకాంత్ ను కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే బాధితుడు తమను ఆశ్రయించారని పేర్కొన్నారు.
-----------------------
Reporter