సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్లో ఓవైపు గణేషుడి శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. మరోవైపు.. అదే మంచి ఛాన్స్ అంటూ రెచ్చిపోయారు జేబు దొంగలు. భారీగా తరలివచ్చిన జనాలనే ఆసరాగా చేసుకుని తమ చేతివాటం ప్రదర్శించారు కేటుగాళ్లు. వేలాది గణపయ్యాలు ఒక్కొక్కరుగా గంగమ్మ ఒడికి చేరుతుంటే.. ఆ అద్భుత, సుందర దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు సాగర తీరానికి తరలి వచ్చారు. కానీ, మాకు కావాల్సిందే అన్నట్లుగా.. పిక్పాకెటర్స్ రెచ్చిపోయారు. అందినకాడికి దోచుకున్నారు. ప్రజల జేబులను కొల్లగొట్టారు. ట్యాంక్బండ్పై హడావుడిని తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు కేటుగాళ్లు. వేలాది మంది పోలీసులు.. వందలాది కెమెరాల కళ్లుగప్పి.. ప్రజల జేబులను దోచుకున్నారు దొంగలు. రెండవ రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జనాలు.. కాగా, హైదరాబాద్లో రెండవ రోజు కూడా గణేష్ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగుతోంది. వేలాది గణపతులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. 24 గంటలుగా ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతూ వస్తోంది. ట్యాంక్బండ్పై ఇంకా హడావుడి కనిపిస్తోంది. భారీ గణేషుల శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. దొంగలు ఉన్నారని, తమ తమ వస్తువుల పట్ల పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇక ఒకే రోజు 67 చోరీ కేసులు నమోదవడంతో పోలీసులు కూడా భద్రతను పటిష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
-----------------------
Admin