సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నకిరేకల్ : నిన్నటి రోజున సాయంత్రం 5: 30 గంటల సమయంలో బోడ ఆశ్రిత W/O అశ్విని కుమార్ ఈమె నకిరేకల్ ఏ వి ఎం స్కూల్లో ఉపాధ్యాయురాలు గా పని చేస్తుంది. ఉదయం స్కూల్ కి వెళ్ళింది విద్యార్థులను స్కూల్లో కొత్త అడ్మిషన్స్ చేర్చుకొనుటకు క్యాన్వసింగ్ చేశారు మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చింది. ఆమెకు ఇంతలోనే విపరీతమైన టెంపరేచర్ అంతలోనే హీట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందింది అని తెలిపినరు . కాబట్టి బంధుమిత్రులారా ఈ ఏప్రిల్, మే, నెలల్లో సాధ్యమైనంత వరకు బయట ఏ పని ఉన్నా ఉదయం 10 గంటల లోపు పని ముగించుకుని ఇంటిపట్టుల నీడలో ఉండడం మంచిది. ప్రస్తుత టెంపరేచర్ 45° డిగ్రీలు గా నమోదు అవుతుంది. ఇప్పుడు ఉన్న ఎండ ఎలాంటిది అంటే ఎండ కొట్టినట్టు కూడా అనిపించదు. లో లోపల ఏం జరుగుతుందో చనిపోయే వరకు అర్థం కాదు, దానికి ఉదాహరణ నిన్న జరిగిన ఈ సంఘటన. కాబట్టి బంధుమిత్రులారా ఎట్టి పరిస్థితుల్లో ఎండలో తిరగకండి. మీ పిల్లలను కూడా బయట తిరగనివ్వకండి
-----------------------
Admin