సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రానికి సమీపంలో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీధర్మశాస్త అయ్యప్పస్వామి ఆలయానికి సోమవారం వారి కార్యాలయం వద్ద తహశీల్దార్ కునుకుంట్ల శ్రీధర్ శ్రీ మణికంఠస్వామివారి రాతిశిల మూలవిరాట్ విగ్రహం అందించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులునాయుడు తెలిపారు.పదేళ్ల క్రితం ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుండి పంచలోహ అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకొన్న తహశీల్దార్ శ్రీధర్ ఆలయం విశిష్ట కోసం నల్లరాతిశిల మూలవిరాట్ విగ్రహాన్ని అందించిన సందర్బంగా అయన ఆనందం వ్యక్తం చేస్తూ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అయన కోరారు.ముందుగా కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలం కోవెలకుంట్ల నుండి శ్రీ మణికంఠస్వామి రూపంతో రూపొందిన స్వామివారి విగ్రహానికి గౌనిపల్లి పూజారి పంచరత్న సురేష్ శర్మ తహశీల్దార్ శ్రీధర్ సమక్షంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి,ఆలయనిర్మాణ సంకల్పకుల పచ్చార్ల ఆంజనేయులునాయుడుకు అందించి అనంతరం ఆలయంలో కర్పూరం హరతులతో నీరజనాలు సమర్పించారు.ఈసందర్బంగా తహశీల్దార్ శ్రీధర్ మాట్లాడుతూ పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని గ్రామాలలో నిత్యాకల్యాణం పచ్చతోరణాలతో ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరు పరస్పర సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అయన ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ రామచంద్రరెడ్డి, భక్తమండలి కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రభాకర్ రెడ్డి, టైలర్ నిజాం, ఏపిడి శ్రీనివాసులురెడ్డి , హోసింగ్ ఏఈ హరిప్రసాద్ రెడ్డి, టిఏ శివప్రతాప్ రెడ్డి, వీఆర్వోలు రమణస్వామి, నరసింహులు, లోకేశ్వరి, శివప్ప, సిఓ విశ్వనాధ్ రెడ్డి, ఆదినారాయణమ్మ, విఆర్ఏలు రంగప్ప, రామాంజి, అశ్వని, అశ్వర్డప్ప, యువసేవకులు మల్లెల రమేష్, వాసు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin