సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట : నూతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అనంతరం జారే మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత మన అందరి ఆశాజ్యోతి, సామాజిక స్పృహ నవసమాజ నిర్మాణం కోసం ఒక దిక్సూచి గా ఉండాలనే తన యొక్క ఆలోచనా విధానం గొప్పది అని, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత దేశ పరిపాల విధానం, దేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల తిరిగి అనేక శాసనాలు ఆ యొక్క సామాజిక వర్గానికి ఏ విధమైన చట్టాలను రూపకల్పన చేస్తే బాగుంటుందని ఆలోచన తో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయటం జరిగిందని కొనియాడుతూ, మీ గ్రామంలో ఒక లైబ్రరీ ని ఏర్పాటు చేసినట్లయితే, నా వంతు సహాయంగా, పుస్తకాలను అందజేస్తాననీ తెలియజేస్తూ, మాజీ ఎంపీ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన, అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరియు వివిధ నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin