సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. వేలాది మంది సభకు వస్తారని అనుకున్న పొంగులేటి ఆశలపై కొత్తగూడెం ప్రజలు నీళ్లు చల్లారు. మరోవైపు సభా వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఫొటో లేకపోవడం తో ఆయన అభిమానులు గొడవకు దిగారు. అప్పటికప్పుడు ఫొటోను ఫ్లెక్సీపై అతికించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.సభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఎదురుచూసినా కొద్ది మందికే పరిమితమమైంది. వేదికపై ఉన్న వారికి శాలువాలు కప్పి సభను ముగించారు. సభ జరుగుతుండగానే చాలా మంది కార్యకర్తలు మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. సభకు ముందు కొత్తగూడెంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తుండగా సైడ్ ఇవ్వమన్నందుకు కేటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుడిపై పొంగులేటి వర్గీయులు దాడి చేశారు. రెండు బైక్లు రౌండప్ చేసి చితకబాదారు. కేవలం రోడ్డు పైనుంచి జరగమని చెప్పినందుకు తనపై తీవ్రంగా దాడి చేశారని బాధితుడు లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించాడు.
-----------------------
Admin