Friday, 08 May 2026 11:37:33 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పొంగులేటి ఫస్ట్‌ మీటింగ్‌ ఫ్లాప్ అయినట్టేనా..?

Date : 02 August 2023 05:17 PM Views : 440

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. వేలాది మంది సభకు వస్తారని అనుకున్న పొంగులేటి ఆశలపై కొత్తగూడెం ప్రజలు నీళ్లు చల్లారు. మరోవైపు సభా వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య ఫొటో లేకపోవడం తో ఆయన అభిమానులు గొడవకు దిగారు. అప్పటికప్పుడు ఫొటోను ఫ్లెక్సీపై అతికించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.సభ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు కూడా ఉంటాయని ఎదురుచూసినా కొద్ది మందికే పరిమితమమైంది. వేదికపై ఉన్న వారికి శాలువాలు కప్పి సభను ముగించారు. సభ జరుగుతుండగానే చాలా మంది కార్యకర్తలు మధ్యలోనే ఇంటి ముఖం పట్టారు. సభకు ముందు కొత్తగూడెంలో మోటర్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిస్తుండగా సైడ్‌ ఇవ్వమన్నందుకు కేటీపీఎస్‌ కాంట్రాక్టు కార్మికుడిపై పొంగులేటి వర్గీయులు దాడి చేశారు. రెండు బైక్‌లు రౌండప్‌ చేసి చితకబాదారు. కేవలం రోడ్డు పైనుంచి జరగమని చెప్పినందుకు తనపై తీవ్రంగా దాడి చేశారని బాధితుడు లక్ష్మీదేవిపల్లి పోలీసులను ఆశ్రయించాడు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :