సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : బుధవారం సంగెం మండల కేంద్రంలోని రైతు వేదికలో సంగెం మండలం మరియు 17వ డివిజన్ పరిధిలోని గ్రామాల పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ కు చెక్కులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...61 మంది లబ్ధిదారులకు 61 లక్ష 7వేల 76 రూ విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అలాగే 62 మంది లబ్ధిదారులకు 25 లక్షల 60వేల రూ విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా 2576 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 25 కోట్ల 78 లక్షల 98వేల 816 రూ మరియు 2437 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 8 కోట్ల 14 లక్షల 88వేల రూ చెక్కులను పంపిణీ చేసామన్నారు.నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వా నిర్లక్ష్యం వైఖరి వల్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆలస్యం అయ్యాయని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో సకాలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందేలా కృషి చేస్తామని తెలిపారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని, ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు.అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు.
-----------------------
Reporter