సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు , మండల కన్వీనర్లు, మండల ఇన్చార్జ్ లు, మండల సమన్వయ కర్తలు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం లో ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి బి ఆర్ఎ స్ సీనియర్ నాయకులు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి హాజరై ఎమ్మెల్యే సైది రెడ్డి మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి.మరో 24 రోజులు అందరూ కలిసి బాగా కష్టపడాలి. ప్రతి ఒక్కరూ తానే అభ్యర్థి అనుకోని పని చేయాలి.మనం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.అని నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో పని చేయాలి. యుద్ధంలో గెలిచే వరకు, గులాబీ జెండా ఎగిరే వరకు విశ్ర మించ్చోద్దు. నాయకులు,కార్యకర్తలు, కార్యోన్ముఖులు అయి, పట్టుదల తో ముందుకుపోవాలి, మన సత్తా ఏంటో చూపించాలి, ప్రతి రోజు అప్రమత్తంగా ఉండాలని, ధైర్యం గా చురుకుగా ఉండాలి అన్నారు. మన పార్టీ బలం నిరూపించాలి, మన శక్తి సామర్ధ్యాలను, ఉపయోగించి,పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి అన్నారు.సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు తెలియజేయాలి, కొత్త పాత తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే పార్టీ అని మన బి ఆర్ ఎస్ పార్టీ అని అన్నారు.అందరూ కలిసికట్టుగా సమన్వయం తో పని చేసి,మరోసారి మన హుజూర్ నగర్ లో బి ఆర్ ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో మన బి ఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం కోసం అందరూ పని చెయ్యాలని, నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని ఎవరు అధైర్య పడొద్దని ,పేదల అభ్యున్నతికి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన అన్నారు.ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణ,నిబద్ధతతో పని చేసి, ఈ నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని తెలిపారు. అలాగే ఈ నెల నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
-----------------------
Admin