Monday, 14 September 2026 05:43:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణలో బీఎస్పీ మార్కు చూపిస్తాం...!

Date : 08 May 2023 12:23 AM Views : 564

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని బహుజన్ సమాజ్ పార్టీ పూరిస్తుందని ఇక తాడోపేడో తేల్చుకుని తీరుతామని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ స్పష్టం చేశారు ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ భరోసా సభకు హైదరాబాద్ బయలుదేరుతున్న సందర్భంగా పార్టీ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు బస్టాండ్ సమీపంలోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ కు చేరుకొని పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాజ్యాధికారం దిశగా బీఎస్పీ ఆలోచనలు చేస్తుందని చెప్పారు అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని చెప్పారు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ముఖ్యఅతిథిగా జరిగే తెలంగాణ భరోసా మహాసభతో బీఎస్పీ పూర్తిస్థాయిలో రానున్న ఎన్నికలకు సర్వం సన్నద్ధం అవుతుందన్నారు రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని అవినీతి రాజ్యమేలుతుందని ఆరోపించారు భవిష్యత్తు తరాలకు భరోసా కల్పించాలంటే ఒక్క బహుజన్ సమాజ్ వాది పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిపారు ఈ దఫా తెలంగాణలో జరిగే ఎన్నికల్లో బీసీలు ఎస్సీలు,ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకునే విధంగా ముందుకు సాగుతామని వివరించారు ఆ దిశగా అడుగులు వేయడంతో పాటు విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ముందుకు సాగుతామని అన్నారు ఎన్నికలు అనగానే టక్కు టమారా విద్యలతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తాడని ఇలా రెండు పర్యాయాలు చేయగలిగాడని కానీ ఈసారి ఎవరున్నా లేకున్నా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వీటిని అడ్డుకొని తీరుతామని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని నిరూపిస్తామని స్పష్టం చేశారు అనంతరం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి వేలాదిగా వాహనాలలో హైదరాబాదులోని సరూర్నగర్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళ్లారు ఈకార్యక్రమంలో సాయి,స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి హరిబాబు,నాగుల రవికుమార్,కోలా మల్లికా,బండి రమణి,కోళ్లపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: