సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కెసిఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల బతుకుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నందిగామ మండలం మోత్కుల గూడలో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించి వారికీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరుతున్నారని ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరుస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్న ప్రజల తీరు ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారిలో మోత్కులగూడ గ్రామానికి చెందిన బీరయ్య, అంతయ్య, చెన్నకేశవులు, మహేష్, బీరయ్య, శివశంకర్, నరసింహులు, శివకుమార్, హనుమంతు, శ్రీశైలం, శంకర్, రాఘవేందర్, శివరాజు, రాజు, హరి శంకర్, మల్లేష్, యాదగిరి, కుమార్, తదితరులు పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని, నియోజకవర్గంలో అంజయ్య యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు.
-----------------------
Admin