Wednesday, 29 July 2026 03:58:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేసిఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు పెద్దపీట... - షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్

Date : 12 July 2023 08:20 AM Views : 466

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కెసిఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు పెద్దపీట వేశారని తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజల బతుకుల్లో ఎన్నో మార్పులు వచ్చాయని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నందిగామ మండలం మోత్కుల గూడలో ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించి వారికీ కండువాలు కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతోమంది పార్టీలో చేరుతున్నారని ఇది ఎంతో శుభ పరిణామం అని అన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను బలపరుస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతున్న ప్రజల తీరు ఎంతో హర్షణీయమని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. పార్టీలో చేరిన వారిలో మోత్కులగూడ గ్రామానికి చెందిన బీరయ్య, అంతయ్య, చెన్నకేశవులు, మహేష్, బీరయ్య, శివశంకర్, నరసింహులు, శివకుమార్, హనుమంతు, శ్రీశైలం, శంకర్, రాఘవేందర్, శివరాజు, రాజు, హరి శంకర్, మల్లేష్, యాదగిరి, కుమార్, తదితరులు పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి సహకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని, నియోజకవర్గంలో అంజయ్య యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తామని పార్టీలో చేరిన వారు అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :